ఇంఫాల్ : మణిపూర్ రాష్ట్రంలో కరోనా (డెల్టా వేరియంట్) విజృంభిస్తున్న నేపథ్యంలో కట్టడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి పదిరోజులపాటు పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ సమయంలో నిత్యావసర సరుకులు, మందులు, కొవిడ్ వ్యాక్సినేషన్కు అనుమతి ఇచ్చింది. వీటితోపాటు కరోనా పరీక్షలు, వైద్య సేవలు, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, టెలికమ్యూనికేషన్, ఇంటర్ నెట్ సేవలు, విమాన ప్రయాణాలు, వ్యవసాయ కార్యకలాపాలకు అనుమతి ఉంటుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమతించిన సేవల సిబ్బంది మినహా ఎవరూ బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు లాక్డౌన్ పాటించి సహకరించాలని పోలీసు ఉన్నతాధికారులు కోరారు. లాక్డౌన్ నిబంధనలు పాటించకుంటే కొవిడ్ వైరస్ను కట్టడి చేయడం సులభతరం కాదని పేర్కొన్నారు.