బెంగళూరు: కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు ఒక పెండ్లి వేడుకను అధికారులు నిలిపివేశారు. కర్ణాటకలోని మంగళూరులో ఈ ఘటన జరిగింది. మహాతోబారా శ్రీ మంగళదేవి ఆలయంలో పెద్ద సంఖ్యలో అతిథులు పెండ్లికి హాజరయ్యారు. ఈ విషయం తెలియడంతో అసిస్టెంట్ కమిషనర్ మదన్ మోహన్ నేతృత్వంలో మంగళూరు మునిసిపల్ కార్పొరేషన్ బృందం అక్కడకు చేరుకుని వివాహ వేడుకను నిలిపివేసింది. ఒకే రోజు నాలుగు పెళ్లిళ్లకు ఆలయ అధికారులు అనుమతిచ్చారని, దీనిపై దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామని అసిస్టెంట్ కమిషనర్ మదన్ మోహన్ తెలిపారు.