దక్షిణాది దినజ్పూర్: ఢిల్లీకి చెందిన ఇద్దరు గూండాలకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని వదలను అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. దక్షిణ దీనాజ్పూర్లో జరిగిన బహిరంగ సభ ర్యాలీలో మమతా బెనర్జీ ప్రసంగించారు. నేను ఆటగాడిని కానప్పటికీ ఎలా ఆడాలో మాత్రం నాకు తెలుసునని, ఇటీవలి కాలం వరకు లోక్సభలో ఉత్తమ ఆటగాడినని చెప్పారు. బెంగాల్ను ఢిల్లీకి చెందిన ఇద్దరు గూండాలకు అప్పగించలేదని కుండబద్దలు కొట్టారు.
పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీల మధ్య అధికారాన్ని పొందాలని పోరు జరుగుతున్నట్లుగా కనిపిస్తున్నది. బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో సమావేశాలు నిర్వహిస్తుండగా.. దీదీ మాత్రం తానే అన్నీ అయి కార్యకర్తలకు మార్గదర్శనం చేస్తున్నారు.
ఎనిమిది దశల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి ఐదు దశలు పూర్తయ్యాయి. ఏడవ, ఎనిమిదవ దశ పోలింగ్ ఏప్రిల్ 26, 29 న జరుగనున్నది. ఓట్ల లెక్కింపు మే 2 న నిర్వహించనున్నారు.
కొవిడ్ వ్యాప్తి భయాందోళనలు ఉన్నప్పటికీ మమతా బెనర్జీ నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన కార్యకర్తలు ఎలాటి భౌతిక దూర నిబంధనలను పాటించకపోవడం కనిపించింది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 10,784 తాజా కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. వీటితో రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,88,956 కు చేరిందని ఆరోగ్య శాఖ బుధవారం తెలిపింది.
అమెరికా దౌత్యవేత్తలకు రష్యా దేశ బహిష్కరణ
సౌదీ ఎయిర్బేస్పై దాడి మా పనే: హైతీ తిరుగుబాటుదారులు
అంగారకుడిపై నాసా ఆక్సిజన్ ఉత్పత్తి
మొక్కల పెంపకంపై గూగుల్ డూడుల్
పాకిస్తాన్లో శాంతిని భారత్ కోరుకోవడం లేదు : పాక్ మంత్రి షేక్ రషీద్
పాకిస్తాన్లో సీనియర్ జర్నలిస్టుపై కాల్పులు
రష్యా తురుపుముక్క లెనిన్.. చరిత్రలో ఈరోజు
హాయిగా నిదురపో.. జ్ఞాపకశక్తి పెంచుకో..!
వేగాన్లలో ఎముకల పగుళ్లు.. పరిశోధకుల హెచ్చరిక
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..