ముంబైలో పాదచారిపై కత్తితో దాడిచేసిన దుండగుడు.. వీడియో

ముంబై: ముంబైలో ఓ పాదచారిపై దుండగుడు కత్తితో దాడిచేశాడు. అయితే అప్రమత్తమైన అతడు ఉన్మాది నుంచి తప్పించుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడిన ఘటన గతనెల 28న జరిగింది. ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఉన్న పాదచారుల వంతెనపై నుంచి ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెనుకనుంచి ముసుగుతో వచ్చిన ఓ దుండగుడు అతనిపై కత్తితో దాడిచేశాడు. మరోమారు పొడవడానికి ప్రయత్నించేలోపు అతడు అప్రమత్తమై తప్పించుకున్నాడు. మళ్లీ దాడిచేయడానికి ప్రయత్నించినప్పటికీ బాధితుడు ప్రతిఘటించడంతో దుండగుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇదంతా ఫుటోవర్ బ్రిడ్జిపై ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది.
కాగా, దాడికి పాల్పడిన వ్యక్తి డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నించినట్లు లేదని పోలీసులు అన్నారు. ఇది ఆ వ్యక్తిపై ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడేనని, అతడిని గాయపరచడానికో లేదా చంపడానికో ప్రత్నించినట్లు ఉందని అనుమానం వ్యక్తంచేశారు.
#WATCH | Man survives knife attack, on a pedestrian bridge in the Kurla area in Mumbai, Maharashtra (28.11.2020)
— ANI (@ANI) December 2, 2020
"There was no attempt by the attacker to appropriate any money. It only seems to be an attack with an intent to cause grievous injury or death," says a police officer pic.twitter.com/xjhOEjQPuB
తాజావార్తలు
- ఇక మొబైల్లోనే ఓటరు గుర్తింపు కార్డు
- ఎయిర్పోర్ట్లో రానా, మిహీక
- చిరుతను చంపి.. వండుకుని తిన్న ఐదుగురు అరెస్ట్
- పాయువుల్లో బంగారం.. పట్టుబడ్డ 9 మంది ప్రయాణికులు
- వాళ్లను చూస్తే కాజల్కు మంటపుడుతుందట..
- జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల
- పది మంది ఉగ్రవాదులపై ఎన్ఐఏ చార్జిషీట్
- గుడిపల్లిలో దారుణం.. తల్లిని చంపిన తనయుడు
- రఫేల్ జెట్ : దేనికైనా రెడీ
- 150కి చేరిన కొత్త రకం కరోనా కేసులు