న్యూఢిల్లీ : కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్పై కేంద్రం మీమాంసను వీడింది. ఇది వేగంగా వ్యాప్తి చెందుతుందనే నిపుణుల సూచనతో తక్షణమే కట్టడి చర్యలు చేపట్టాలని కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సూచించింది. ప్రతికూల పరిస్థితి తలెత్తకుండా భారీసంఖ్యలో టెస్టింగ్ నిర్వహించాలని సూచించింది. నూతన వేరియంట్ బయటపడిన జిల్లాలు, క్లస్టర్లలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరింది.
పాజిటివ్ రోగుల నమూనాలను తదుపరి పరిశీలన కోసం ప్రత్యేక లేబొరేటరీలకు పంపాలని కోరింది. మహారాష్ట్రలోని రత్నగిరి, జలగావ్ జిల్లాలతో పాటు కేరళలోని పలక్కాడ్, పతనమిట్ట జిల్లాలు, మధ్యప్రదేశ్లని భోపాల్, శివపురి జిల్లాల్లో సేకరించిన జీనోమ్ సీక్వెన్డ్స్ నమూనాలను పరిశీలించంగా ఆయా చోట్ల డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వెలుగుచూశాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.