జైపూర్: కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను మూడంస్థుల బిల్డింగ్ పైనుంచి తోసేశాడో కీచక భర్త. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత.. తన మరదలికి ఫోన్ చేసి అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ దుర్ఘటన రాజస్థాన్లోని కోటాలో జరిగింది.
కోటాకు చెందిన నిషా బైర్వా, హన్స్రాజ్ బైర్వా భార్యా భర్తలు. గత కొంతకాలంగా వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఆమె తన మేనమామ ఇంటివద్ద ఉంటున్నది. అయితే భార్యాభర్తలు ఇద్దరు కలిసి కిరాయికి ఇళ్లు కోసం వెతకడానికి పట్టణంలోని ఉద్యోగ్ నగర్కు వెళ్లారు. అక్కడ ఓ మూడంతస్థుల ఇంట్లో రూమ్ని చూశారు.
అయితే అక్కడ అంతా నిర్మానుష్యంగా ఉండటంతో అదే అదునుగా భావించిన హన్స్రాజ్.. నిషాను బిల్డింగ్ పైనుంచి కిందికి నెట్టేశాడు. అంతెత్తు నుంచి కింద పడిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె మరణించిందని నిర్ధారించుకున్న అనంతరం.. నిష మరణించిన విషయాన్ని అతని మరదలికి ఫోన్ చేసి చెప్పాడని, తర్వాత అక్కడి నుంచి పారిపోయాడని పోలీసు అధికారి మహమ్మద్ ఇబ్రహిం చెప్పారు. నిందితుని కోసం గాలిస్తున్నామని, అతనిపై ఐపీసీ సెక్షన్ 30 కింద కేసు నమోదు చేశామన్నారు.