థానె: కరోనా వ్యాక్సిన్ కోసం వెళ్లిన వ్యక్తికి రేబిస్ టీకా ఇచ్చిందో నర్సు. దీంతో ఆమెపై వేటువేసిన అధికారులు బాధితుడిని దవాఖానకు తరలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మహారాష్ట్రలోని థానె జిల్లాలో జరిగింది. రాజ్కుమార్ యాదవ్ అనే వ్యక్తి కరోనా వ్యాక్సిన్ కోసం థానె మున్సిపల్ కార్పొరేషన్ పధిలోని కల్వాలో ఉన్న అటక్నోనేష్వర్ హెల్త్కేర్ సెంటర్కు వెళ్లాడు. అయితే అతడు కొవిడ్ టీకా లైనులో నిలబడే బదులు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ లేనులో వెళ్లాడు. దీంతో కీర్తి పొపేర్ అనే నర్సు అతనికి రేబిస్ టీకా ఇచ్చింది.
పొరపాటును గుర్తించిన అధికారులు నర్సును సస్పెండ్ చేశారు. పేషెంట్ కేస్ పేపర్ను పరిశీలించకుండా విధుల్లో అలసత్వం ప్రదర్శించినందుకుగాను ఆమెపై వేటు వేస్తున్నట్లు మున్సిపల్ అధికారులు ప్రకటించారు. బాధితుడిని దవాఖానకు తరలించామని, అతడి ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.