కౌశాంబి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కౌశాంబి జిల్లా కరారీ ఏరియాలోని మీరాపూర్ గ్రామంలో దారుణం జరిగింది. ఓ భర్త తన భార్యను పారతో గట్టిగా కొట్టి చంపేశాడు. వివరాల్లోకి వెళ్తే.. మీరాపూర్ గ్రామానికి చెందిన సుగ్గీదేవి (35), ఫకీర్ లాల్ (48) భార్యాభర్తలు. ఫకీర్లాల్కు సుగ్గీదేవి రెండో భార్య. వీరికి ముగ్గురు సంతానం కూడా ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇద్దరి వాగ్వాదం పెరిగింది. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఫకీర్లాల్ తన చేతిలో ఉన్న పారను తీసుకుని సుగ్గీదేవి తలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. పరారీలో ఉన్న ఆమె భర్త ఫకీర్లాల్ కోసం గాలింపు చేపట్టారు.