జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని కాకతీయ 6 వ బొగ్గు గనిలో 2 వ షిఫ్ట్ లో విధులు నిర్వహిస్తుండగా బండ కూలి ఇద్దరు సింగరేణి కార్మికుల మృతి చెందిన ఘటనపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విచారం వ్యక్తం చేశారు.
వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఘటనకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తగు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తమ సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాలను ఆదుకుంటామని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సింగరేణి అధికారులకు మంత్రి సూచించారు. అలాగే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని, సింగరేణి సంస్థ నుంచి తక్షణమే వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
మావోయిస్టుల చెరలో క్షేమంగా ఉన్న జవాన్ రాకేశ్వర్..!
ఫోలిక్ యాసిడ్ మనకు ఎందుకు అవసరమంటే..?
11న ‘మల్లన్న’ క్షేత్రంలో అగ్నిగుండాలు
ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్కు అండగా వరంగల్ ప్రజలు
మైనార్టీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి