ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ వ్యక్తి ఘాతుకానికి ఒడిగట్టాడు. అప్పటికే ఓ హత్యకేసులో జైలుకు వెళ్లి, బెయిల్పై వచ్చి, మరో వ్యక్తిని హత్యచేశాడు. గొవాండి పరిసరాల్లోని న్యూ గౌతమ్నగర్ ఏరియాలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గొవాండి ప్రాంతానికి చెందిన మర్తుజా ఖాన్ ఓ హత్య కేసులో జైలుకు వెళ్లి ఇటీవలే బెయిల్పై బయటికి వచ్చాడు. ఈ క్రమంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో కూలీగా పనిచేసే ఖందు మారుతి దహిభతేతో అతనికి పరిచయడం ఏర్పడింది.
ఇద్దరి నివాసాలు ఇరుపొరుగునే కావడంతో తరచూ ఇద్దరూ కలిసి మద్యం సేవించేవారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి కూడా ఇద్దరూ మద్యం సేవిస్తుండగా గొడవ జరిగింది. మాటామాటా పెరుగడంతో ముర్తుజా ఖాన్ తన దగ్గరున్న కత్తితీసి దహిభతేను విచక్షణారహితంగా పొడిచాడు. దాంతో దహిభతే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దాంతో డియోనర్ పీఎస్కు చెందిన పోలీసులు దహిభతేను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.