ఖంద్వా: చిన్న అజాగ్రత్త పెను విషాదాన్ని మిగిల్చింది. ఓ 13 ఏండ్ల బాలిక రన్నింగ్ బస్సు కిటికీలోంచి తల బయటికి పెట్టి వాంతులు చేసుకుంటుండగా ఎదరుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలిక తల తెగిపోయి నుజ్జునుజ్జయ్యింది. ఈ హఠాత్పరిణామానికి బస్సులోని ప్రయాణికులంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. తలలేని బాలిక మొండెం కొట్టుకోవడం చూసి తల్లడిల్లారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖంద్వా జిల్లాలోని రోషియా ఫేట్ వద్ద ఇండోర్-ఇచ్చాపూర్ రహదారిపై మంగళవారం ఉదయం 9.30 గంటల సమయంలో ఈ ఘోరం జరిగిందని పోలీసులు తెలిపారు. బాలిక తన తల్లితో కలిసి ప్యాసింజర్ బస్సులో ఇండోర్కు వెళ్తుండగా ప్రమాదం బారినపడిందని చెప్పారు. ప్రమాదంలో బాలిక తల పూర్తిగా మొండెం నుంచి వేరై చిధ్రమైందన్నారు. లారీని సీజ్ చేశామని, పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం వెతుకుతున్నామని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
తప్పుడు హామీలకు మోసపోవద్దు.. ఎన్నికల ప్రచారంలో ప్రియాంకాగాంధీ
ఓట్ల కోసం వరి నాటు వేస్తూ మంత్రి వినూత్న ప్రచారం..!
మోదీ సభకు వెళ్తుండగా ప్రమాదం.. తమిళనాడు స్పీకర్కు గాయాలు
ఆ ఆరు రాష్ట్రాల్లోనే అధికంగా కొత్త కేసులు: కేంద్రం
పున్నమి చంద్రుడే ఆ నౌకను కదిలించాడు.. !