రాజన్న సిరిసిల్ల : శ్రీరాజరాజేశ్వర జలాశయం ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యాక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కృష్ణభాస్కర్, ఆర్డీవో శ్రీనివాసరావుతో కలిసి ముంపు గ్రామాల సమస్యలపై సమీక్షించారు. ఆర్అండ్ఆర్ కాలనీలో నిర్వాసితులు కట్టుకున్న ఇళ్లకు కొత్త ఇంటినెంబర్లు వెంటనే కేటాయించాలని సూచించారు. ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలు దాదాపు పూర్తయినట్లు తెలిపారు. ఇంకా చిన్న చిన్ని సమస్యలు మిగిలిపోయాయని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నిర్వాసితుల సమస్యలపై ప్రభుత్వం చిత్తుశుద్ధితో వ్యవహరిస్తుందని, అందరికీ న్యాయం జరగేలా చూస్తామన్నారు. నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేనివని, రాష్ట్రంలోని మెట్ట భూములు సస్యశ్యామలం అవుతున్నాయంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ భగీరథ ప్రయత్నమేనని చెప్పారు. మండుటెండల్లోనూ కాళేశ్వర జలాలతో చెరువులు, కుంటలు మత్తళ్లు దూకడం దేశ చరిత్రలో మొదటిసారన్నారు. మల్లన్నసాగర్ నుంచి గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు నింపి చివరి ఆయకట్టు వరకు నీరందించే బృహత్తర కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. యాసంగిలో లక్ష్యానికి మించి ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్చైర్మన్ మంచె శ్రీనివాస్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, జిల్లా అధికార ప్రతినిధి తోట ఆగయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మద్యం డోర్ డెలివరీ చేస్తానంటూ మోసం
త్వరలో సోమశిల- సిద్ధేశ్వరం బ్రిడ్జి నిర్మాణం
న్యాయవాది వృత్తిలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
అసంపూర్తి పనులు సత్వరమే పూర్తి చేయాలి
మెరుగైన వైద్యమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే గండ్ర