భువనగిరి టౌన్, ఏప్రిల్ 5 : క్షౌరశాలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం పట్టణంలోని వినాయకచౌరస్తాలో నాయీబ్రాహ్మణ సేవా సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం పట్టణ అధ్యక్షుడు పత్తేపురం మహేందర్ మాట్లాడారు. సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి కానుగంటి ప్రేమ్కుమార్, నాయకులు రాచమల్ల మురళి, పత్తేపురం సురేశ్, నాగపురి నర్సయ్య, శివ, వేముల సత్యనారాయణ, రాజు పాల్గొన్నారు.
ఆలేరులో ..
ఆలేరు టౌన్, ఏప్రిల్ 5 : ఆలేరులో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి నాయీ బ్రాహ్మణులు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, అంజయ్య, పాండు, రాము, ఉపేందర్, శ్రీను, కిష్టయ్య, లక్ష్మణ్, శ్యామ్, వెంకటేశ్, హరిబాబు, కిశోర్, సుభాష్, రాజేశ్, శ్రవణ్కుమార్, రంగబాబు పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం)లో…
ఆత్మకూరు(ఎం), ఏప్రిల్ 5: క్షౌరశాలలు, లాండ్రీలు, ధోబీఘాట్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ మండల కేంద్రంలోని రజక సహకార సంఘం కార్యాలయంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రజక సహకార సంఘం గ్రామ శాఖ అధ్యక్ష, కార్యదర్శులు వెలిమెకన్నె సత్యనారాయణ, ప్రశాంత్తో పాటు జిల్లా నాయకుడు బుచ్చయ్య, మండల నాయకులు నగేశ్, హెలేందర్, మురళీకృష్ణ, యాదయ్య, తిరుమలేశ్, శంకరయ్య, ఉప్పలయ్య, కిష్టయ్య, ముత్తయ్య పాల్గొన్నారు.
సంస్థాన్నారాయణపురంలో..
సంస్థాన్నారాయణపురం, ఏప్రిల్ 5: క్షౌరశాలలు,లాండ్రీలు, ధోబీఘాట్లకు సీఎం కేసీఆర్ నెలకు 250యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించడంపై మండల కేంద్రంలో నాయీబ్రాహ్మణుల మండల కమిటీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సర్పంచ్ శ్రీహరి, నాయీబ్రాహ్మణుల సేవా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సికిలమెట్ల ప్రభాకర్, జిల్లా నాయకుడు కానుగుల వెంకటయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు యాదగిరి, ప్రధాన కార్యదర్శి శశికాంత్ , భిక్షం, గణేశ్, శ్రీకాంత్, మహేశ్, తిరుమల్లేశ్ పాల్గొన్నారు.
బస్వాపురంలో
భువనగిరి అర్బన్, ఏప్రిల్ 5: రాష్ట్ర రజక సంఘాల జేఏసీ, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు ముదిగొండ రాములు ఆధ్వర్యంలో మండలంలోని బస్వాపురంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జూపల్లి నగేశ్, నాయకులు వెంకటేశ్, పాండురాజు, భాస్కర్, జమ్ములు, వెంకటేశ్, సురేశ్, కృష్ణ, రాజారామ్ పాల్గొన్నారు.
బీబీనగర్లో….
బీబీనగర్, ఏప్రిల్5 : మండల కేంద్రంలో నాయీబ్రాహ్మణులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. సర్పంచ్ భాగ్యలక్ష్మీశ్రీనివాస్, నారగోని మహేశ్, కోఆప్షన్ సభ్యులు అక్బర్, సంతోష్రెడ్డి, మస్తాన్, నరేందర్, నాయీబ్రాహ్మణుల సంఘం మండల అధ్యక్షుడు వన్నాల రమేశ్, ఉపాధ్యక్షుడు ప్రసాద్, సాయి, రాజు, జగదీశ్ పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
రైతులను తప్పుదోవ పట్టించిన ప్రతిపక్షాలు
వ్యాక్సిన్ను సద్వినియోగం చేసుకోవాలి