న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్లోని ఓమ్పొరా ఏరియాలో 11 రోజుల క్రితం ఓ బాలికను చిరుత చంపేసింది. ఆ చిరుతను మంగళవారం అటవీశాఖ అధికారులు నిర్బంధించారు. ఓమ్పొరా ఏరియాలో నాలుగేండ్ల బాలిక అదృశ్యమైంది. రెండు రోజుల పాటు వెతికినా బాలిక ఆచూకీ లభించలేదు. చివరకు స్థానికంగా ఉన్న నర్సరీ వద్ద బాలిక మృతదేహం లభ్యమైంది. బాలికను చిరుత చంపిన ఆనవాళ్లు ఉన్నాయి. దీంతో ఆ ప్రాంతంలో చిరుత ఆచూకీ కోసం స్థానికులు, అటవీశాఖ అధికారులు కలిసి గాలించారు. మంగళవారం రోజు ఆ చిరుతను బోనులో నిర్బంధించారు.