న్యూఢిల్లీ: ఈ మధ్య సెల్ఫీల పిచ్చితో చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీల కోసం సాహసాలు చేసి ప్రమాదాలకు బలవుతున్నారు. తాజాగా ఢిల్లీలో కూడా పుల్ ప్రహ్లాద్పూర్ ఏరియాకు చెందిన ఒక వ్యక్తి రైల్వే అండర్ పాస్లో నిలిచిన నీళ్ల మధ్య సెల్ఫీలు దిగాడు. ఇంతలో వరద పెరిగిపోవడంతో నీళ్లలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని గల్లంతైన వ్యక్తి కోసం గాలించగా మృతదేహం లభ్యమైంది.
మృతుడు జైతాపూర్కు చెందిన రవి చౌతలాగా గుర్తించారు. ఈ మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చేటుచేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.