ముంబై : మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. నిత్యం 20వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పలు జిల్లాల పరిధిలో లాక్డౌన్తో పాటు నైట్కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు సెలబ్రెటీలు ఎంతో మంది వైరస్కు పాజిటివ్గా పరీక్షించారు. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సతీమణి రష్మిఠాక్రే సైతం వైరస్ పాజిటివ్గా తేలింది. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. దీంతో ఆమె ఐసోలేషన్లో ఉన్నారని ఓ అధికారి తెలిపారు. ఇటీవల ఉద్ధవ్ తనయుడు ఆదిత్య ఠాక్రే సైతం మహమ్మారి బారినపడిన విషయం తెలిసిందే. ఈ నెల 11న ఉద్ధవ్ఠాక్రేతో కలిసి రష్మి స్థానిక జేజే హాస్పిటల్లో కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు.