హైదరాబాద్: నగర శివార్లలోని వనస్థలీపురం ఆటోనగర్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆటోనగర్లో వేగంగా దూసుకొచ్చిన డీసీఎం ఓ బైక్పై వెళ్తున్న దంపతులను ఢీకొట్టింది. దీంతో భార్య స్వాతి అక్కడికక్కడే మృతిచెందగా, భర్త తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. సుష్మా వద్ద ఉన్న ఓ షాపింగ్ మాల్లో షాపింగ్ ముగించుకుని హయత్నగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..