న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం ఢిల్లీ వచ్చారు. మంగళవారం నుంచి గురువారం వరకు పలువురు ప్రతిపక్ష నేతలతో ఆమె భేటీ కానున్నారు. జాతీయ రాజకీయాలపై ఆమె దృష్టి పెట్టారన్న వార్తల నేపథ్యంలో ఈ సమావేశాల అజెండా ప్రాధాన్యం సంతరించుకున్నది. శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీని కూడా ఆమె కలిసే అవకాశం ఉన్నది.