కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జిపై బీజేపీ మరోసారి తీవ్ర విమర్శలు చేసింది. మమతాబెనర్జి ప్రధాని మోదీని నిధులు అడుక్కోవడానికే ఢిల్లీకి వెళ్తున్నారని పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ విమర్శించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు అన్నింటిని మమతాబెనర్జి దుర్వినియోగం చేశారని, ఇప్పుడు మరోసారి ప్రధానికి దండం పెట్టుకుని నిధులు అడుక్కోవడానికే మమత ఢిల్లీకి వెళ్తున్నారని దిలీప్ ఘోష్ ఆరోపించారు.
అయితే, దిలీప్ ఘోష్ ఆరోపణలకు తృణమూల్ కాంగ్రెస్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. రాష్ట్ర నాయకుడు ఎప్పుడైనా ప్రజా సంక్షేమం కోసం దేశ నాయకుడిని కలిసే అవకాశం ఉంటుందని, అది సమాఖ్య విధానమని తృణమూల్ కాంగ్రెస్ నేత కునాల్ ఘోష్ మండిపడ్డారు. ఇలాంటి ఆరోపణ చేసేముందు దిలీప్ ఘోష్ సమాఖ్య వ్యవస్థ గురించి తెలుసుకుని ఉంటే బాగుండేదని ఆయన ఎద్దేవా చేశారు.