నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎంతో ఉత్కంఠ రేపిన నందిగ్రామ్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజయం సాధించారు. రౌండ్ రౌండ్కూ ఆధిక్యం చేతులు మారిన ఈ స్థానంలో చివరికి మమతా 1200 ఓట్ల తేడాతో గెలిచారు. 16 రౌండ్లు ముగిసే సరికి కేవలం 6 ఓట్ల ఆధిక్యంలో ఉన్న బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి.. చివరి రౌండ్లో ఓటమి చవిచూశారు. ఈ స్థానంపై మొదటి నుంచీ ఉత్కంఠ నెలకొంది. తొలి ఐదు రౌండ్లూ సువేందు ఆధిక్యంలో నిలిచారు. తర్వాత పుంజుకున్న మమత చివరికి విజయం సాధించారు.
ఎన్నో ఏళ్లుగా నందిగ్రామ్ అధికారి కుటుంబానికి పెట్టని కోటగా ఉంది. మమతకు సన్నిహితంగా ఉన్న సువేందు అధికారి ఎన్నికల ముందు బీజేపీలోకి వెళ్లారు. అయితే మమత ఆయనపైనే పోటీ దిగుతానని పట్టుబట్టి బరిలోకి దిగారు. చివరికి విజయం సాధించారు. అధికారి కోటను బద్ధలు కొట్టారు. అటు టీఎంసీ కూడా ఘన విజయం సాధించడంతో బెంగాల్కు ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు మమతా బెనర్జీ.