కోల్కతా : పశ్చిమ బెంగాల్లో కాషాయ పార్టీ కొవిడ్-19ను వ్యాప్తి చేస్తోందని సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీకి కనీసం 70 స్ధానాలు కూడా రావని అన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దీదీ బుధవారం జల్పాయిగురి జిల్లాలోని దబ్గ్రాం ఫుల్బరిలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు.
కాషాయ నేతలు బెంగాల్కు వచ్చి కొవిడ్ను వ్యాప్తి చేసి వెళుతున్నారని, గత ఏడాది కరోనా వైరస్ బెంగాల్లో విజృంభించినప్పుడు వీరు కన్నెత్తి చూడలేదని అన్నారు. ఇప్పటివరకూ పోలింగ్ జరిగిన 135 నియోజకవర్గాల్లో బీజేపీ 100 స్ధానాల్లో గెలుపొందుతుందని ప్రధాని మోదీ చెబుతున్నారని కానీ కాషాయపార్టీకి మొత్తం 294 నియోజకవర్గాల్లో కనీసం 70 స్ధానాలు కూడా దక్కవని ఆమె పేర్కొన్నారు. బెంగాల్లో ఎన్ఆర్సీని అనుమతించబోమని దీదీ స్పష్టం చేశారు.