కోల్కతా: కూచ్బిహార్లోని సీతల్కుచిలో కాల్పులకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జే కారణమని కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆరోపించారు. భద్రతా బలగాలను టార్గెట్ చేయాలంటూ మమతా బెనర్జి తన పార్టీ కార్యకర్తలకు పిలుపునివ్వడం వల్లనే హింస చెలరేగి కాల్పులకు దారితీసిందని చెప్పారు. సీతల్కుచి ఘటనకు బాధ్యత వహిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలన్న మమతాబెనర్జి డిమాండ్ నేపథ్యంలో షా ఈ వ్యాఖ్యలు చేశారు.
అదేవిధంగా సీతల్కుచి ఘటన మినహా పశ్చిమబెంగాల్లో ఇప్పటివరకు అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా చెప్పారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాగానే రాజకీయ, ఎన్నికల సంబంధ హింసకు చరమగీతం పాడుతామని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నదియా జిల్లాలోని శాంతిపూర్లో అమిత్షా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మమతపై విమర్శలు గుప్పించారు.
సీతల్కుచిలో భద్రతాసిబ్బంది కాల్పుల్లో మరణించిన నలుగురు మృతులకు మాత్రమే మమత సంతాపం తెలిపారని, అంతకుముందే మరో ఘటనలో మరణించిన ఐదో వ్యక్తి అయిన ఆనంద్ బర్మన్ కోసం ఆమె ఒక్క కన్నీటి బొట్టు కూడా కార్చడం లేదని షా విమర్శించారు. ఆనంద్ బర్మన్ రాజవంశీ సామాజిక వర్గానికి చెందినవాడు కావడమే కారణమని, ఇది బెంగాల్ సంస్కృతి కాదని షా ఎద్దేవా చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
టీకాలే లేకుండా టీకా ఉత్సవ్ ఎలా.. ప్రధానికి ముఖ్యమంత్రుల లేఖలు..!
దారితప్పి బావిలోపడ్డ ఏనుగుపిల్ల.. రక్షించిన అధికారులు.. వీడియో
అది ఒక హత్యాకాండ.. కూచ్బిహార్ కాల్పులపై మమతాబెనర్జి
72 గంటల్లో 12 మంది ఉగ్రవాదులు హతం..!
దేశంలో 10 కోట్ల మార్కు దాటిన కొవిడ్ వ్యాక్సినేషన్: కేంద్రం