చెన్నై: మమతా బెనర్జీ సోషలిజంను పెళ్లాడింది. అవును.. సోషలిజం అంటే గుర్తుకొచ్చేది కమ్యూనిస్టులు. అలాంటి కమ్యూనిస్టులకు వ్యతిరేఖంగా పోరాడి అధికారాన్ని చేజిక్కించుకున్నది మమతా బెనర్జీ. మరి ఆ కమ్యూనిస్టును మమతా బెనర్జీ పెండ్లిచేసుకోవండం ఏంటా అని అనుకుంటున్నారా.. కానీ ఇక్కడ మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ సీఎం దీదీ కాదు. ఆమె తమిళనాడుకు చెందిన మహిళ. ఆమె తండ్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. మమత పోరాటానికి గుర్తుగా తన కూతురుకు ఆ పేరు పెట్టుకున్నాడు.
ఇక పెండ్లి కొడుకు విషయానికి వస్తే.. అతని కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, సేలం జిల్లా కార్యదర్శి ఏ.మోహన్. దీంతో తన పిల్లలకు సోషలిజం, లెనినిజం అని పేరు పెట్టుకున్నాడు. విశేషం ఏంటంటే పెండ్లి కొడుకు బావ పేరు మార్క్సిజం.
ఇక విషయానికి వస్తే.. తమిళనాడులోని సేలంలో మమతా బెనర్జీ, సోషలిజంల వివాహం నిరాడంబరంగా జరిగింది. కరోనా నిబంధనలకు అనుగుణంగా కొత్తూర్లో కొద్ది మంది సమక్షంలో ఇద్దరు ఒక్కటయ్యారు. ఆహ్వానితులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
తన చిన్నతనంలో మా నాన్న తనకు ఆ పేరు ఎందుకు పెట్టారో అర్థం కాలేదని వధువు మమతా బెనర్జీ చెప్పింది. కానీ పెద్దవుతుంటే ఆమె పోరాటం గురించి తెలిసింది. కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పోరాడి పశ్చిమ బెంగాల్ సీఎం అయ్యిందని తెలిపింది. అయితే ఇక్కడ మాత్రం కరడుగట్టిన కమ్యూనిస్టుకి, కాంగ్రెస్ నాయకుని కుమార్తెకు వివాహం జరగడం విశేషం.