న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం ద్వారా మమతాబెనర్జి బీజేపీకి సహాయపడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌధరి ఆరోపించారు. ఆమె ప్రధాని మోదీకి దళారీలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కోల్కతా (బెంగాల్ సర్కారు) మాది, ఢిల్లీ (కేంద్ర సర్కారు) మీది అన్నట్లుగా తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య ఒప్పందం కుదిరిందని చౌధరి వ్యాఖ్యానించారు. లేదంటే మమతాబెనర్జి కాంగ్రెస్ పార్టీ గురించి మమతాబెనర్జి అనవసరపు వ్యాఖ్యలు చేసేవారు కాదని చెప్పారు.
వచ్చే ఏడాది ప్రారంభంలో గోవా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి గోవాలో అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది. ఆ మేరకు ప్రణాళికాబద్దంగా పావులు కదుపుతున్నది. ఈ క్రమంలో ఆమె గోవాలో బలంగా ఉన్న బీజేపీతోపాటు కాంగ్రెస్ పార్టీపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అధిర్ రంజన్ చౌధరి మమతాబెనర్జి వ్యాఖ్యలను తప్పుపట్టారు.