నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో నందిగ్రామ్ స్థానం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. రౌండ్ రౌండ్కూ ఆధిక్యం చేతులు మారుతూ ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. మొత్తం 17 రౌండ్లలో ఇప్పటికే 14 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ప్రస్తుతం మమత 1900 ఓట్ల లీడ్లో మమత ఉన్నారు. తొలి రౌండ్లూ సువేందు ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. మధ్యలో 13వ రౌండ్లోనూ ఆధిక్యంలోకి వచ్చినా.. ఆయన మళ్లీ వెనుకంజలోకి వెళ్లిపోయారు.