కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై 24 గంటల ప్రచార నిషేధం విధించింది ఎన్నికల సంఘం. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఈ చర్య తీసుకోవడం గమనార్హం. ముస్లిం ఓట్లు, కేంద్ర బలగాలపై తిరబడండి అన్న వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. గత వారమే ఆమెకు రెండు నోటీసులు జారీ చేశారు. బెంగాల్లో మరో నాలుగు విడతల ఎన్నికలు మిగిలి ఉన్నాయి. మమతపై నిషేధం కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ అరోరాకు చివరిది కావడం గమనార్హం. సోమవారంతోనే ఆయన పదవీకాలం ముగిసింది.