మెదక్: రామాయంపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, మాజీ జెడ్పీ చైర్మన్ రాజయ్యగారి ముత్యంరెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాసవిడిచారు. ఆయన స్వస్థలం చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామం. 1978లో రామాయంపేట ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. 1980లో ముఖ్యమంత్రిగా ఉన్న టంగుటూరి అంజయ్య కోసం ముత్యంరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..