హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సీఎం కేసీఆర్ 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు ఆనందం వ్యక్తం చేశాయి. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ..పటాకులు కాలుస్తూ సంబురాలు జరుపుకున్నారు. కరోనా కష్టకాలంలో కూడా ఫిట్మెంట్ ప్రకటించడం హర్షణీయమన్నారు. ఫిట్మెంట్ ప్రకటించినందుకు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.