న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రో ధరలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పెట్రోల్పై కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే పన్నులు వేయడం లేదని, పెట్రో ఉత్పత్తులపై వేసే పన్నుల్లో రాష్ట్రాలకూ 41 శాతం వాటా వస్తున్నదని ఆమె చెప్పారు. పెట్రో ధరల పెంపుపై రాష్ట్రాలు కూడా ఆలోచించాలని, అవసరమైతే కేంద్రంతో చర్చించాలని ఆమె సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి ఓ నిర్ణయం చేస్తే మంచి ఫలితాలు రావచ్చని పేర్కొన్నారు.
అదేవిధంగా దేశంలోని యువత ప్రతిభను గ్రహించి మరింత వృద్ధి సాధించేందుకు దేశవ్యాప్తంగా కొన్ని పాలసీలను అమలు చేయాల్సిన అవసరం ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు. అందుకు రానున్న 25 ఏండ్లు ఎంతో కీలకమన్నారు.