చెన్నై : 1971 బంగ్లాదేశ్ యుద్ధంలో పాల్గొన్న యుద్ద వీరుడు, మహావీర చక్ర అవార్డు గ్రహీత గోపాల్ రావు కన్నుమూశారు. ఆయన వయసు 94 ఏళ్లు. నేవీ ఆఫీసర్ అయిన గోపాల్ రావు.. వీర్ సేన మెడల్ కూడా గెలుచుకున్నారు. బంగ్లా యుద్ధంలో పాల్గొన్నందుకు ఆయనకు ఆ మెడల్ ఇచ్చారు. ఇవాళ సాయంత్రం గోపాల్ రావుకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. 1971లో చేపట్టిన కాక్టస్ లిల్లీ ఆపరేషన్లో గోపాల్రావు ఓ కమాండర్గా బాధ్యతలు నిర్వర్తించారు. నేవీకి చెందిన వెస్ట్రన్ ఫ్లీట్ తరపున ఆయన యుద్ధంలో పాల్గొన్నారు. కరాచీ తీరం వద్ద ఆ ఆపరేషన్ సాగింది. సబ్మెరైన దాడి సమయంలో ఆయన శత్రు దేశానికి చెందిన సముద్ర జలాల్లోకి తన టీమ్తో దూసుకువెళ్లారు. కరాచీ పోర్ట్లో ఉన్న ఇంధన క్షేత్రాలను కమాండర్ రావు పేల్చేశారు.