ముంబై: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణతో జనం ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని జీవనం గడుపుతుంటే.. కామాంధులు మాత్రం తమతీరు మార్చుకోవడం లేదు. ఆడపిల్ల ఒంటరిగా ఉందని తెలిస్తే చాలు వీధి కుక్కల్లా మీదపడి సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్నారు. కాదు కాదు.. వీధి కుక్కలు కూడా సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని బాంద్రా (పశ్చిమ) జిల్లాలో అలాంటి దారుణమే జరిగింది.
బాంద్రా వెస్ట్ జిల్లాలోని ఓ పట్టణంలో 19 ఏండ్ల యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఇంట్లో యువతి ఒంటరిగా ఉన్నదని తెలిసి స్థానికంగా ఉండే ముగ్గురు వ్యక్తులు ఆ ఇంట్లో చొరబడి దారుణానికి ఒడిగట్టారు. ఈ నెల 12న జరిగిన ఈ ఘటనపై బాధిత యువతి తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా.. కోర్టు ఆ ముగ్గురికి ఈ నెల 19 వరకు పోలీస్ కస్టడీ విధించింది.