ముంబై: మహారాష్ట్రలో ఈ నెల 17 నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. ఆగస్ట్ 17 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో 5 నుండి 8 వ తరగతి వరకు పాఠశాలలను తిరిగి తెరుస్తామని మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ శుక్రవారం తెలిపారు. కరోనా నిబంధనలను అనుసరించి నగరాల్లో 8 నుండి 12 వ తరగతి వరకు స్కూళ్లను తెరుస్తామని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.