ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి ఆందోళన రేపుతున్నది. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 67,123 కరోనా కేసులు, 419 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 37,70,707కు, మరణాల సంఖ్య 59,970కు చేరింది. గత 24 గంటల్లో 56,783 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 30,61,174కు చేరగా ప్రస్తుతం 6,47,933 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.