శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న బీజేపీ
ముకుల్రాయ్ను పక్కనపెట్టి మరీ ఎంపిక
కోల్కతా, మే 10: అసెంబ్లీ ఎన్నికల్లో మమతాబెనర్జీని ఓడించి సంచలనం సృష్టించిన సువేందు అధికారిని తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా పశ్చిమబెంగాల్ బీజేపీ ఎన్నుకుంది. తృణమూల్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు మమత తర్వాత రెండోస్థానంలో ఉన్న ముకుల్రాయ్ ప్రస్తుతం తమ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. ఆయనను పక్కనపెట్టి సువేందుకు శాసనసభాపక్ష నేత బాధ్యతలను బీజేపీ అప్పగించటం విశేషం. మరోవైపు, బీజేపీ ఎమ్మెల్యేల సమావేశానికి 22 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరుకావటం సందేహాలు రేపింది. తృణమూల్ దాడుల నుంచి కార్యకర్తలను రక్షించుకోవటం కోసం మిగిలిన ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో ఉన్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ చెప్పారు. కాగా, పశ్చిమబెంగాల్లో 77 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు కేంద్రం ప్రభుత్వం భద్రత కల్పించింది. బీజేపీ ఎమ్మెల్యేల భద్రతకు ముప్పు ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో హోంశాఖ ఈ నిర్ణయం తీసుకొన్నది.
43 మందితో మమత క్యాబినెట్
మమత బెనర్జీ క్యాబినెట్లో 43 మందికి అవకాశం లభించింది. వీరిలో 24 మంది క్యాబినెట్ ర్యాంకు మంత్రులు. 8 మంది మహిళలకు క్యాబినెట్లో చోటు లభించింది. సీఎంతో కలుపుకొంటే.. మహిళల సంఖ్య 9. కొత్తవారికి 16 మందికి పదవులు లభించాయి.