సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ): పట్టణ ప్రగతిలో భాగం గా జలమండలి పరిధిలోని మ్యాన్హోళ్లకు మరమ్మతులు చేపట్టాలని, ఇందు కోసం సుమారు రూ.12కోట్లను విడుదల చేస్తున్నట్లు జలమండలి ఎండీ దానకిశోర్ ప్రకటించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో శనివారం అధికారులతో ఎండీ దానకిశోర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు,నాలుగు లేన్లలో 330కిలోమీటర్ల మేర ఉన్న రోడ్లకు సమాంతరంగా లేని సుమారు 9,835 మ్యాన్హోళ్లను గుర్తించినట్లు ఆయన తెలిపారు. వీటిని త్వరగా రోడ్డుకు సమాంతరంగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఈ మరమ్మతులను ఈనెల 10వ తేదీ వరకు పూర్తి చేయాలని అధికారులకు జలమండలి ఎండీ ఆదేశాలు జారీ చేశారు. పట్టణ ప్రగతిలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు ప్రజలను భాగస్వామ్యం చేసి, వాళ్ల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్నారు. మ్యాన్హోళ్లలో పూడికతీత పనులు చేపట్టి, వెంటనే వ్యర్థాలను తొలగించాలని సూచించారు. కార్యక్రమం లో జలమండలి ఇంజినీర్ ఇన్ చీఫ్, ఆపరేషన్స్ డైరెక్టర్ అజ్మీరా కృష్ణ, సీజీఎంలు విజయారావు, ప్రభు, సుజా త, వినోద్ భార్గవ్,ఆనంద్ నాయక్, శ్రీధర్పాల్గొన్నారు.