ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో
కొత్తగా 34,389 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. మరో 974 మంది కరోనా వల్ల
ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రోజు వ్యవధిలోనే 59,318 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 81,486కు చేరింది. మొత్తం కేసుల సంఖ్య 53,78,452కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,68,109 యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు ముంబై నగరంలో కొత్తగా 1544 మందికి పాజిటివ్గా తేలింది. ఇవాళ ఒక్కరోజే 60 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వల్ల ముంబైలో చనిపోయిన వారి సంఖ్య 14,260కు చేరింది.