పశ్చిమబెంగాల్లో గెలుపు కోసం బీజేపీ సర్వశక్తులూ ఒడ్డింది. దాదాపు రెండేండ్ల కిందటి నుంచే అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమైంది. కైలాస్ విజయవర్గీయ, శివప్రకాశ్, అరవింద్ మీనన్ వంటి సీనియర్ నాయకులను రాష్ర్టానికి పంపింది. కేంద్ర హోం మంత్రి అమిత్షా కూడా బెంగాల్పై ప్రత్యేక దృష్టిసారించారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ సహా జాతీయనేతాగణమంతా విస్తృతంగా పాల్గొన్నారు. ప్రధాని దాదాపు 20 సభల్లో పాల్గొనగా, అమిత్షా 50 సభలకు హాజరయ్యారు. రాజ్నాథ్, స్మృతీ ఇరానీ, ధర్మేంద్ర ప్రదాన్, యోగి ఆదిత్యనాథ్ వంటి నేతలు కూడా విస్తృతంగా పర్యటించారు. మరోవైపు సువేంధు అధికారి సహా తృణమూల్లోని ముఖ్యనేతలను పార్టీలో చేర్చుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్టీ బలం గణనీయంగా పెరిగింది. అయినప్పటికీ పార్టీ అనుకున్న ఫలితాలను సాధించలేకపోయింది. దీనికి కారణాలు..