ముంబై: మహారాష్ట్రలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో చాలా రోజుల తర్వాత కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 18,600 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. రెండు నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో చివరిసారిగా మార్చి 16న సుమారు 18వేల కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కరోనాతో మరో 402 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,71,801 యాక్టివ్ కేసులున్నాయి. కొవిడ్ వల్ల మరణించిన మొత్తం కేసుల సంఖ్య 94,844కు చేరింది.