ముంబై : మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,891 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 16,577 మంది కోలుకొని దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. 295 ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కొవిడ్ కేసులు 58,52,891కి పెరిగాయి. వీరిలో 55,80,925 మంది చికిత్సకు కోలుకున్నారు. మొత్తం యాక్టివ్ కేసులు 1,67,927కు చేరాయి. ఇవాళ్టి వరకు మొత్తం 1,01,127 మంది మృతి చెందారు. రాజధాని ముంబై నగరంలో ఇవాళ కొత్తగా 728 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మరణించినట్లు బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. మహారాష్ట్రలో కొవిడ్ రికవరీ రేటు 95.35గా శాతంగా ఉంది. మరణాల రేటు 1.73గా ఉంది. 11,53,147 మంది హోంక్వారంటైన్లో ఉన్నారు. 6,225 మంది ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.