చౌటుప్పల్ రూరల్, జూలై4: ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి అన్నారు. పల్లెప్రగతిలో భా గంగా ఆయన ఆదివారం మండల పరిధిలోని ఆరెగూడెం, కా ట్రేవు, పంతంగి తదితర గ్రామాలను సందర్శించారు. ఈ సం దర్భంగా ఆయా గ్రామాల్లోని ప్రతి ఇంటికి ఆరు మొక్కలను అందజేశారు. అనంతరం పల్లెప్రకృతి వనాలను, వన నర్సరీ లను, చెత్త డంపింగ్ యార్డ్లు, వైకుంఠ ధామాలను పరిశీలిం చారు. ఆయన వెంట ఎంపీడీవో రాకేశ్రావు, మండల ప్రత్యేకా ధికారి శ్రీలక్ష్మి, సర్పంచ్లు మునగాల ప్రభాకర్రెడ్డి, బాతరాజు సత్యం, బచ్చ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పండుగల హరితహారం
సంస్థాన్ నారాయణపురం: ఏడో విడుత హరితహార కార్యక్ర మాన్ని నారాయణపురం మండల ప్రజలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని పండుగలా జరుపుకున్నారు. ఈ సంద ర్భంగా సర్వేల్ గ్రామంలో జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, ఎంపీపీ ఉమారెడ్డి, జడ్పీటీసీ భానుమతీ గౌడ్ హరితహారంలో భాగం గా మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాలల్లో ఎంపీడీవో యాదగిరి, ఎంపీటీసీ యాదయ్య, నరసింహ, సర్పంచ్లు యా దయ్య గౌడ్, భిక్షపతి, సత్యం, పాండురంగా నాయక్, టీఆర్ఎ స్వీ మునుగోడు అధ్యక్షుడు రమేశ్, అధికారులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలి
బీబీనగర్: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఒక మొ క్కను నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్థ్ధాయి సంఘం చైర్మన్, జడ్పీటీసీ ప్రణీతారెడ్డి, సర్పంచ్ భాగ్యలక్ష్మి అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా ఆదివా రం వారి ఆధ్వర్యంలో బీబీనగర్ మండల కేంద్రంలోని పలు వార్డుల్లో ఇంటింటికీ తిరిగి ఆరు మొక్కలు పంపిణీ చేశారు. కా ర్యక్రమంలో ఉపసర్పంచ్ దస్తగిరి, వార్డు సభ్యులు ప్రవీణ్, అంజి, వేణు, కోఆప్షన్ సభులు అక్బర్, లక్ష్మీనారాయణ, కార్య దర్శి తుల్జాప్రసాద్, పంచాయతి సిబ్బంది పాల్గొన్నారు.
పచ్చదనమే పర్యావరణ పరిరక్షణకు శ్రీరామరక్ష
వలిగొండ: పచ్చదనమే పర్యావరణ పరిరక్షణకు శ్రీరామరక్ష అని ఎంపీపీ రమేశ్ రాజ్ అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా ఆ దివారం మండలంలోని గోకారంలో హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. అదేవిధంగా వెల్వర్తి, చిత్తాపురం, గోప రా జుపల్లి, జాలుకాల్వ, వర్కట్పల్లి, సంగెం గ్రామాల్లో వీధులను శుభ్రం చేసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్లు అంజిరెడ్డి, రాంరెడ్డి, ఉపేంద్ర, సత్తిరెడ్డి, శేఖర్, సందీప్, మాధ వి, అన్నామేరి, ఎంపీడీవో గీతారెడ్డి, ఎంపీవో కేదారీశ్వర్, వెల్వ ర్తి టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు రాములు, వార్డు సభ్యులు, పం చాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
ఆలేరురూరల్: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అ ని సర్పంచ్ మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలం లోని గుండ్లగూడెంలో ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు.
ప్రతి గ్రామం హరిత వనం కావాలి
ఆత్మకూరు(ఎం): ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతిలో ప్రతి గ్రా మం హరితవనం అయ్యే విధంగా మొక్కలు నాటి సంరక్షించా లని మండల ప్రత్యేకాధికారి శ్యామ్ సుందర్, ఎంపీడీవో రా ములు అన్నారు. ఆదివారం మండల కేంద్రంతో పాటు సర్వేప ల్లి, పుల్లాయిగూడెం గ్రామాలలో ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. అదేవిధంగా కొరటికల్, ఉప్పలపహడ్, కఫ్రాయిపల్లి, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో ప్రధాన వీధుల వెంట ఉన్న చెత్తను తొలగించడంతో పాటు పాత ఇండ్లను తొలగించి శుభ్రపర్చా రు. కార్యక్రమంలో ఎంపీవో పద్మావతి, సర్పంచ్లు నగేశ్, ఎల్ల య్య, నర్సింహారెడ్డి, వరలక్ష్మి, మాధవి, సరిత, గిరిజ, తహసీ ల్దార్ కార్యాలయం ఆర్ఐ యాదగిరి, కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఇంటింటా మొక్కల పంపిణీ
యాదగిరిగుట్ట రూరల్: నాలుగో విడుత పల్లెప్రగతిలో భాగం గా ఆదివారం యాదగిరిగుట్ట మండల వ్యాప్తంగా అన్ని గ్రామా ల్లో ఇంటింటికి మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని గుట్ట ఎంపీడీవో ప్రభాకర్రెడ్డి పర్యవేక్షించారు. దాతరుపల్లిలో గ్రామస్తులకు మొక్కలు అందజేశారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఇంటింటికీ ఆరు మొక్కల చొ ప్పున అందజేస్తున్నట్లు తెలిపారు.
మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి
తుర్కపల్లి: ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యత చేపట్టాలని ఎంపీపీ భూక్యా సుశీల, మండల ప్రత్యేకా ధికారి రెహమాన్ అన్నారు. హరితహారంలో భాగంగా ఆదివారం మండల కేంద్రంలో, రాంపూర్లోని ఆదర్శ పాఠశాల, వాసాలమ ర్రి, వీరారెడ్డిపల్లి గ్రామాల్లో మొక్కలు నాటా రు. అదేవిధంగా ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఉమాదేవి, సర్పంచ్లు ఆంజనేయులు, వని త, శ్రీవాణి, మంజుల, ఎంపీటీసీలు నవీన్ కు మార్, మోహన్బాబు తదితరులు పాల్గొన్నా రు.