అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వద్ద ఆనందయ్య మందు పొట్లాలు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ప్రకాశం జిల్లా సమీక్షకు హాజరైన మంత్రులకు ఆయన ఈ మందు పొట్లాలను అందజేస్తుండగా మీడియా కంటపడింది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి ఈ మందు పొట్లాలను ఎంపీ అందజేశారు.
కరోనా బారినపడిన సామాన్యులు మందుకోసం కృష్ణపట్నం చుట్టూ తిరుగుతున్నా లభించని తరుణంలో ఎంపీ వద్ద మందు పొట్లాలు కనిపించడం విమర్శలకు ఆజ్యం పోస్తోంది. ఆనందయ్య మందును ఏపీలోని మంత్రులు, ఎంపీలు తమ ఇళ్లలో నిలువ చేసుకున్నారన్న విపక్ష ఆరోపణలకు బలం చేకూరుస్తున్నది. కాగా కరోనా నియంత్రణకు ఆనందయ్య అందిస్తున్న ఆయుర్వేద ఔషధం పంపిణీకి ఏపీ ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వకపోవడం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.