ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొవిడ్ కేసులతో పాటు వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 42,582 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా, 850 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో 54,535 మంది కరోనా రోగులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,33,294 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో రికవరీ రేటు ప్రస్తుతం 88.34శాతంగా ఉంది. మరణాల రేటు 1.5శాతంగా ఉంది. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 52,69,292కు చేరింది. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 78,857 పెరిగింది.