‘బాలాకోట్' చాటింగ్ దుమారం

- కేంద్రప్రభుత్వంపై ప్రతిపక్షాల ధ్వజం
- అర్ణబ్కు దాడుల విషయం ముందే.. ఎలా తెలిసిందని ప్రశ్నల వర్షం
- ఎన్నికల్లో గెలుపు కోసమే దాడులు: పాక్
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణబ్ గోస్వామికి, టీవీ చానళ్ల రేటింగులను నిర్ధారించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) మాజీ అధిపతి పార్ధో దాస్ గుప్తాకి మధ్య బాలాకోట్ దాడులకు సంబంధించి జరిగినట్టు చెబుతున్న వాట్సాప్ చాటింగ్ తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నది. పాకిస్థాన్లో ఉగ్రస్థావరాలున్న బాలాకోట్పై భారత వాయుసేన మెరుపుదాడి చేయనున్నదన్న విషయం దాడి జరుగడానికి మూడు రోజుల ముందే అంటే ఫిబ్రవరి 23, 2019 రోజునే అర్ణబ్కి తెలిసిందని, ఇదే విషయంపై దాస్ గుప్తాతో ఆయన వాట్సాప్ చాటింగ్ ద్వారా చర్చించారని పేర్కొంటూ కొన్ని సందేశాలు లీకయ్యాయి. మే, 2019 సాధారణ ఎన్నికల్లో గెలుపు కోసమే మోదీ సర్కార్ బాలాకోట్పై దాడులను ప్లాన్ చేసినట్టు ఆ చాటింగ్ సందేశాలు స్పష్టం చేస్తున్నాయి. దీనిపై రాజకీయంగా తీవ్ర కలకలం రేగుతున్నది.
2019 సాధారణ ఎన్నికల్లో ప్రధాని మోదీని మరోసారి గద్దెనెక్కించేందుకే భారత్లోని ఒక మీడియా సంస్థ, మోదీ సర్కార్ కలిసి ఒక భయానకమైన మెరుపు దాడుల నాటకాన్ని ఆడిందని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ధ్వజమెత్తారు. దేశ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఒక జర్నలిస్టుకు చేరవేయడం ‘నేరపూరిత చర్య’ అని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఈ సమాచారంపై చర్చించిన ఇద్దర్నీ (అర్ణబ్, దాస్గుప్తాలను) జైలుకు పంపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంకోవైపు, అర్ణబ్ చాటింగ్ అంశంపై దృష్టిసారించాలని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశ భద్రతకు సంబంధించి ఈ విషయం చాలా కీలకమైనదని పేర్కొన్నారు. ఇదే అంశంపై తమ రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణ చేపట్టేందుకు న్యాయపరమైన సలహాను తీసుకుంటామని తెలిపారు.
తాజావార్తలు
- సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పూర్తైన లక్ష్యం
- భారీగా విదేశీ సిగరెట్లు స్వాధీనం
- సైన్స్ విద్యార్థులకు ఐఐఎస్ఈఆర్ గొప్ప వేదిక : వినోద్ కుమార్
- తల్లి కాబోతున్న రిచా గంగోపాధ్యాయ
- 2జీ, 3జీ, 4జీ.. ఇవన్నీ తమిళనాడులో ఉన్నాయి: అమిత్ షా
- కొవిడ్ వారియర్స్ క్రికెట్ పోటీల విజేతగా డాక్టర్ల జట్టు
- టీమ్ఇండియా ప్రాక్టీస్ షురూ
- 125 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- బాయ్ఫ్రెండ్తో క్లోజ్గా శృతిహాసన్..ట్రెండింగ్లో స్టిల్స్
- మహారాష్ట్రలో కొత్తగా 8,293 కరోనా కేసులు.. 62 మరణాలు