ఢిల్లీ,జూన్ 19: ప్రముఖ వాహనతయారీ సంస్థ యమహా భారత మార్కెట్లోకి సరికొత్త వాహనాలను విడుదల చేసింది.’ ఎఫ్జెడ్-ఎక్స్’ పేరుతో ఒక బైక్ ను ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర(ఎక్స్షోరూమ్) రూ. 1.16 లక్షలు. యమహా కంపెనీ ఈ బైక్ తో పాటు మరో రెండు మోడళ్లను కూడా ఆవిష్కరించింది. అవి యమహా ఫాసినో , యమహా రే-జెడ్ఆర్ స్కూటర్స్. సరికొత్త ఫీచర్స్ తో ఈ స్కూటర్ల రూపొందించారు. ఇవి త్వరలోనే షోరూమ్ల్లో అందుబాటులోకి తీసుకురానున్నది యమహా.
కొత్త స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్లైట్, ఎల్ఈడీ టెయిల్ లైట్ అందించింది. ఈ హెడ్లైట్ లోపల ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్టె ఏర్పాటుచేశారు. టెయిల్ లైట్డిజైన్ మరింత ఆక్షర్షణీయంగా ఇచ్చారు. స్కూటర్ రెండు వైపులా సైడ్ ప్యానెల్స్పై 3డీ ఫాసినో లోగో వస్తుంది. కొత్త ఫాసినో ఇప్పుడు మొత్తం 9 రంగుల్లో లభిస్తుంది. స్కూటర్ స్ట్రెంత్ ను పెంచుతూ సంస్థ ఫాసినో మెటల్ , ఫ్రంట్ ఆప్రాన్ ,మడ్గార్డ్ను ఏర్పాటు చేసింది. వెనుక 110 మిమీ టైర్ను అందిస్తుంది.