ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్నది. దేశవ్యాప్తంగా మూడొంతల కొత్త కేసులు ఈ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణకు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. అలాగే అవగాహనకు కొత్త పద్ధతులు పాటిస్తున్నారు.
ఇందులో భాగంగా ముంబైలోని జేజే ఆసుపత్రి గోడలపై వేయించిన వినూత్న గ్రాఫిటీ పెయింటింగ్స్ ఆకట్టుకుంటున్నాయి. మోనాలిసా, ఫ్రిదా కహ్లో, మార్లిన్ మన్రో, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మాస్కులు ధరించినట్లుగా చిత్రీకరించారు. ఇవి ప్రధాన ఆకర్షణగా నిలువడంతోపాటు కరోనా నేపథ్యంలో మాస్కులు ధరించడంపై అవగాహన కల్పిస్తున్నాయి.