విరమణ వయస్సుపై సీఎండీని కలిశాం
2400 మంది బదిలీ వర్కర్లకు పదోన్నతులు
టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్
శ్రీరాంపూర్లో యూనియన్లో 70 మంది చేరిక
శ్రీరాంపూర్, ఏప్రిల్ 7: సింగరేణి కార్మికులకు కూడా విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచడానికి, తమ గౌరవ అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్ పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ఓసీపీపై బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విరమణ వయస్సును పెంచాలని కోరుతూ ఇప్పటికే సీఅండ్ఎండీని కలిసి కోరినట్లు చెప్పారు. సింగరేణి వ్యాప్తంగా 2400 మంది బదిలీ వర్కర్లకు జనరల్మజ్దూర్లుగా పదోన్నతులు కల్పించడం జరిగిందన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఓసీపీల్లో పని వేళలు మార్చాలని కోరినట్లు తెలిపారు. అలాగే కార్మికులకు మజ్జిగ, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. 11వ వేతన ఒప్పందంపై జాతీయ కార్మిక సంఘాల నాయకులు నోరు మెదపడం లేదని మండిపడ్డారు.
టీబీజీకేఎస్లో 70 మంది చేరిక
శ్రీరాంపూర్ ఓసీపీలో వివిధ యూనియన్లకు చెం దిన 70 మంది కార్మికులు, నాయకులు టీబీజీకేఎస్లో చేరగా, వారికి అధ్యక్షుడు వెంకట్రావ్ కం డువాలు కప్పి స్వాగతం పలికారు. ఏఐటీయూసీ సీనియర్ నాయకుడు దేవేందర్ ఆధ్వర్యంలో ఈ అండ్ఎం సెక్షన్లోని 70 మంది కార్మికులు టీబీజీకేఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి, కేంద్ర ఉపాధ్యక్షులు డీ అన్నయ్య, మల్లారెడ్డి, డిప్యూటీ ప్రధా న కార్యదర్శి చాట్ల అశోక్, కేంద్ర చర్చల ప్రతినిధులు వీరభద్రయ్య, ఏనుగు రవీందర్రెడ్డి, పిట్ కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు అద్దు శ్రీనివా స్, మల్లేశం, శ్రీనివాస్రావు, శ్రీనివాసాచారి, మ ల్లెత్తుల శ్రీనివాస్, సత్యనారాయణ,శంకర్, సారయ్య, జగన్,రాయమల్లు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఏనుగు పిల్లను భుజాలపై మోసుకెళ్లిన ఫారెస్ట్ గార్డ్.. వీడియో వైరల్
కారులో ఒంటరిగా వెళ్లినా.. మాస్క్ తప్పనిసరి: ఢిల్లీ హైకోర్టు