ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే మహారాష్ట్రలోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక మహారాష్ట్ర రాజధాని ముంబై సహా కొన్ని జిల్లాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. కరోనా ప్రభావాన్ని కట్టడి చేయడానికి ఎన్ని ఆంక్షలు పెట్టినా సరిపోవడంలేదు. ఆయా నగరాలు, పట్టణాల్లో సెమీ లాక్డౌన్ విధించినా ఉపయోగంలేదు.
ఇప్పటికే మహారాష్ట్రలో15 రోజుల కర్ఫ్యూ, 144 సెక్షన్ వంటి ఆంక్షలను అమలు చేస్తున్నారు. అయినా మహమ్మారి ప్రభావం ఏమాత్రం తగ్గకపోవడంతో ముంబైతోపాటు వైరస్ ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తే ఫలితం ఉంటుందని మహారాష్ట్ర సర్కారు యోచిస్తున్నది. కల్లోలిత ప్రాంతాల్లో అత్యవసర సేవలు మినహా అన్నిటిపై ఆంక్షలు పెట్టాలని భావిస్తున్నది.
ముంబైలో ఇప్పటికే ఆఫీసులు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూసే ఉండగా ఇప్పుడు పెట్రోల్ బంకులను కూడా ఆ జాబితాలో పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. అత్యవసర సేవలకు కూడా కేవలం రోజుకు నాలుగు గంటలపాటు మాత్రమే అనుమతివ్వాలని యోచిస్తున్నారు. ఔరంగాబాద్, సోలాపూర్, ముంబైతోపాటు రత్నగిరిలోనూ ఈ తరహా ఆంక్షలు పెట్టనున్నారు. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకే ఆంక్షల నుంచి మినహాయింపు ఉన్న షాపులకు అనుమతించనున్నారు.
బ్రేక్ ది చైన్ పేరుతో మహారాష్ట్రలో ఇప్పటికే కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. అయినా కరోనా కేసుల పెరుగుదలలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడంలేదు. కొన్ని రోజుల నుంచి విపరీతంగా కొత్త కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో సంపూర్ణ లాక్డౌనే సమస్యకు పరిష్కారమని అధికారులు భావిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
మాకు మెడిసిన్ పనిచేయదు.. పెగ్గే పని చేస్తుంది.. వీడియో
దేశంలో కరోనా కరాళ నృత్యం.. 24 గంటల్లో భారీగా కొత్త కేసులు
ప్రముఖ రచయిత వెంకటసుబ్బయ్య కన్నుమూత
రాష్ట్రంలో కొత్తగా 4009 కరోనా కేసులు
కరోనాతో విద్యాశాఖ మాజీ మంత్రి కన్నుమూత
నల్లగొండలో దారుణం.. ఆరుబయట నిద్రిస్తున్న దంపతుల హత్య