ముంబై: మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో ఓబీసీ కోటా రద్దుకు వ్యతిరేకంగా ఈ నెల 26న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి పంకజ ముండే తెలిపారు. పౌర ఎన్నికలలో ఓబీసీ కోటాను రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇది ఓబీసీ సమాజానికి తీవ్ర అన్యాయమని అన్నారు. దీనిపై ఈ నెల 26 న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నిరసన తెలుపుతుందని చెప్పారు.