నైట్ కర్ఫ్యూ విధించేందుకు కలెక్టర్లకు అనుమతి

ముంబై: దేశంలో కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నది. అయితే ఇంతలోనే యూకేలో కరోనా మహమ్మారి కొత్త రూపు సంతరించుకుని విస్తరిస్తుండటం, యూకే నుంచి మన దేశానికి వచ్చిన పలువురికి కరోనా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. అందులో భాగంగా కర్ణాటక సహా కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించాయి.
తాజాగా మహారాష్ట్ర సైతం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు జిల్లాల్లో కలెక్టర్లు వారివారి అధికార పరిధి మేరకు నైట్ కర్ఫ్యూ విధించుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే తమ జిల్లాలో నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించుకున్న కలెక్టర్లు, ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి తీసుకోవాలని మహారాష్ట్ర సర్కారు సూచించింది.
ఇవి కూడా చదవండి..
నేటి నుంచి కర్ణాటకలో రాత్రి కర్ఫ్యూ
రాహుల్గాంధీకి ఆలుగడ్డ ఎట్ల పెరుగుతదో తెలియదు
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- మహేశ్ బాబు స్కిన్ స్పెషలిస్ట్ ఈమెనే..!
- సీఎం పదవికి కేటీఆర్ సమర్థుడు : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో పొడి వాతావరణం : ఐఎండీ
- లక్కీ ఛాన్స్ కొట్టేసిన థమన్
- సముద్రాలను భయపెడుతున్న ప్లాస్టిక్ భూతం
- వలసదారులకు చట్టబద్ధతకు బిల్లు రూపొందించిన బైడెన్..!
- సీఎం కేసీఆర్ను విమర్శించొద్దని అప్పుడే నిర్ణయించుకున్న : మంత్రి ఎర్రబెల్లి
- వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
- మీ త్యాగాలను మరచిపోము.. థ్యాంక్స్ చెప్పిన క్రికెట్ ఆస్ట్రేలియా
- కష్టమైన పనేంటో చెప్పిన అల్లరి నరేశ్..!