న్యూఢిల్లీ: మహారాష్ట్ర, ఢిల్లీలో శుక్రవారం రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 63,729 కరోనా కేసులు, 398 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 37,03,584కు, మరణాల సంఖ్య 59,551కు పెరిగింది. గత 24 గంటల్లో 45,335 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 30,04,391కు చేరిందని, ప్రస్తుతం రాష్ట్రంలో 6,38,034 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం రికార్డుస్థాయిలో 19,486 కరోనా కేసులు, 141 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,03,623కు, మరణాల సంఖ్య 11,793కు పెరిగింది. గత 24 గంటల్లో 12,649 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 7,30,825కు చేరిందని, ప్రస్తుతం 61,005 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.